ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది రైతు భరోసా మొదటి విడత సాయాన్ని రేపు (మే 13, గురువారం) రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. మొదటి విడతతో భాగంగా రూ.7,500 చొప్పున 52.38 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.3,882.23 కోట్ల నగదును విడుదల చేయనున్నారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు నగదు జమచేస్తునట్టు ప్రభుత్వం పేర్కొంది.
2019-20 సంవత్సరం నుంచి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తుండగా, ఇప్పటికే రూ.13,101 కోట్లు సాయాన్ని రైతులకు అందించినట్టు పేర్కొన్నారు. మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతులకు అందిస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి మరికొంతమంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ