తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ శనివారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును (కేడీసీసీబీ) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత పోడు భూములపై అవగాహన కోసం సిరిసిల్ల కలెక్టరేట్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
అనంతరం సిరిసిల్ల పట్టణం, సర్దాపూర్ కు చెందిన టీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడు తాళ్ల అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, వారి కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తాళ్ల అఖిల్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ