ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుదవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 90,204 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,591 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 511, చిత్తూరులో 349, పశ్చిమగోదావరిలో 266, ప్రకాశంలో 251, విశాఖపట్నంలో 220 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,29,579 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 15 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కర్నూల్ లో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13057 కి పెరిగింది. గత 24 గంటల్లో 3,329 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,90,565 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ