ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 27, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825 కు, మరణాల సంఖ్య 6625 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 74,757 కరోనా పరీక్షలు నిర్వహించగా 2901 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 19 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కడపలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూల్ లో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6625 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 7,77,970 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 4352 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 27300 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu