ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవంను (సెప్టెంబర్ 27) పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్-2023 క్యాంపెయిన్ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. క్యాంపెయిన్ బ్రోచర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదిని విజిట్ ఆంధ్రప్రదేశ్-2023గా సీఎం ప్రకటించారు.
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సులువుగా గుర్తించేలా రూపొందించిన జీఐఎస్ వెబ్పోర్టల్ను కూడా ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY