ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను గురువారం నాడు బీసీసీఐ ఈసీబీతో కలిసి ఖరారు చేసింది. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత జట్టు 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లండ్ తో జరిగే మూడో టెస్టును డే అండ్ నైట్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ సిరీస్ను చెన్నై, అహ్మదాబాద్, పూణే వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
భారత్-ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్ వివరాలు:
టెస్టులు:
- మొదటి టెస్ట్ – ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు – చెన్నై
- రెండవ టెస్ట్ – ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు – చెన్నై
- మూడవ టెస్ట్ – ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు – అహ్మదాబాద్
- నాలుగవ టెస్ట్ – మార్చి 4 నుంచి 8 వరకు – అహ్మదాబాద్
టీ20లు:
- మొదటి టీ20 – మార్చి 12 – అహ్మదాబాద్
- రెండవ టీ20 – మార్చి 14 – అహ్మదాబాద్
- మూడవ టీ20 – మార్చి 16 – అహ్మదాబాద్
- నాలుగవ టీ20 – మార్చి 18 – అహ్మదాబాద్
- ఐదవ టీ20 – మార్చి 20 – అహ్మదాబాద్
వన్డేలు:
- మొదటి వన్డే – మార్చి 23 – పూణే
- రెండవ వన్డే – మార్చి 26 – పూణే
- మూడవ వన్డే – మార్చి 28 – పూణే
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ