ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 96,153 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 831, చిత్తూరులో 830, పశ్చిమగోదావరిలో 703, కృష్ణాలో 463, ప్రకాశంలో 463 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,20,134 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 53 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో పన్నెండు మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12052 కి పెరిగింది. గత 24 గంటల్లో 10567 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 17,32,948 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 75,134 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ