ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 18, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,077 కు చేరింది. కరోనా నుంచి మరో 54 మంది రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7166 కి పెరిగింది. గత 24 గంటల్లో 28239 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,36,44,086 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 18, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,89,077
- కొత్తగా నమోదైన కేసులు : 67
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,81,292
- యాక్టీవ్ కేసులు : 619
- మొత్తం మరణాల సంఖ్య : 7166
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ