ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో గుండుమల తిప్పే స్వామి, గుమ్మిడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్ (రాజీనామా) ల యొక్క ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29, 2021 తో పూర్తి కానుంది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 25 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 15 వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 25
- నామినేషన్లకు ఆఖరితేదీ – మార్చి 4
- నామినేషన్ల పరిశీలన – మార్చి 5
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – మార్చి 8
- ఎన్నిక జరిగే తేదీ – మార్చి 15
- పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చి 15 (సాయంత్రం 5 గంటల నుంచి)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ