హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో 36 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా రంగులు లేదా రంగు నీరు చల్లడాన్ని ఇష్టపడని వ్యక్తులపై చల్లి అసౌకర్యం కలిగించడం, రోడ్లు, వాహనాలపై రంగులు చల్లడం, టూ వీలర్, ఇతర వాహనాలపై గుంపులుగా రోడ్లపై తిరగడం వంటి చర్యలను నిషేదిస్తునట్టు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ