ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 56,463 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 809 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 161, చిత్తూరులో 153, నెల్లూరులో 115, పశ్చిమగోదావరిలో 93, ప్రకాశంలో 83, గుంటూరులో 78 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,133 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 10 మరణాలు చోటుచేసుకున్నాయి. గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14186 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,160 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,25,805 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,142 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ