తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు స్థానాలకు మార్చి 31, 2021 తో పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 16 వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 14 వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
- నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
- నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 26
- ఎన్నిక జరిగే తేదీ – మార్చ్ 14
- పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చ్ 17
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ