తెలంగాణలో పట్టభద్రుల, ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2021 Telangana MLC Elections Schedule, AP Teachers Quota, ECI Released Schedule for AP Teachers Quota, Graduate MLC Elections, Mango News, SEC, telangana graduate mlc elections, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections Schedule, Telangana MLC Elections Schedule 2021

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు స్థానాలకు మార్చి 31, 2021 తో పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 16 వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 14 వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
  • నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
  • నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 26
  • ఎన్నిక జరిగే తేదీ – మార్చ్ 14
  • పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – మార్చ్ 17

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =