ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,01,863 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 1396, తూర్పుగోదావరి జిల్లాలో 1271, పశ్చిమగోదావరిలో 887, అనంతపూర్ లో 698 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,96,122 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 61 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో పది మంది, ప్రకాశంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11824 కి పెరిగింది. గత 24 గంటల్లో 11135 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 16,88,198 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ