నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ మంగళవారం నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంజయ్య యాదవ్ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైది రెడ్డి, రవీంద్ర కుమార్, పలువురు నల్గొండ జిల్లా నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ కు కీలక పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముందుగా బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న అంజయ్య యాదవ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అధిష్టానం డాక్టర్ పానుగోతు రవికుమార్ కు టికెట్ కేటాయించింది. ఈ క్రమంలోనే స్థానిక టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపుల అనంతరం అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ