ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కరోనా వైద్య పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ గా తేలిన బాధితులకు త్వరితగతిన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జూలై 16, గురువారం నాటికి ఏపీలో 12,40,267 సాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించారు. జూలై 15, బుధవారం ఉదయం 9 గంటల నుంచి జూలై 16, గురువారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 22,304 శాంపిల్స్ ను పరీక్షించారు.
ఏపీలో కరోనా వివరాలు:
జూలై 16 నాటికీ నిర్వహించిన కరోనా పరీక్షలు: 12,40,267
నెగటివ్ వచ్చిన వారు – 12,02,223
యాక్టీవ్ కేసులు – 17692
డిశ్చార్జ్ అయినా వారు – 16975
కరోనా మరణాలు – 492
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు (పాజిటివ్): 2543
విదేశాల నుంచి వచ్చిన వారు (పాజిటివ్) – 432
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu