తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ లు బదిలీ, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శిగా సయ్యద్‌ అలీ మూర్తజా రిజ్వి

15 IAS Officers Transferred, 15 IAS Officers Transferred in Telangana, IAS Officers Telangana, IAS transfers, Minor reshuffle of senior IAS officers, telangana, telangana government, Telangana Government reshuffles 15 IAS officers

తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. జూలై 15, బుధవారం నాడు ఈ బదిలీలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శాంతికుమారి బదిలీ అయ్యారు. ఆమెను అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీచేయగా, సయ్యద్‌ అలీ మూర్తజా రిజ్వి ని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమించారు. అలాగే ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితా రాణా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో వాకాటి కరుణ మళ్ళీ నియమితులయ్యారు.

తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీల వివరాలు:

  • రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా(సీఈవో) – జ్యోతి బుద్ధప్రకాశ్‌
  • వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గా – సయ్యద్‌ అలీ మూర్తజా రిజ్వి
  • ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్ గా – వాకాటి కరుణ
  • ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌గా – యోగితారాణా
  • అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా – శాంతికుమారి
  • ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా – రాణి కుముదిని దేవి
  • ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా – అదర్‌సిన్హా
  • నాగర్‌కర్నూల్‌ కలెక్టర్ గా – ఎల్‌ శర్మన్‌
  • పాఠశాల విద్యా డైరెక్టర్ గా ‌- శ్రీదేవసేన
  • పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి గా – కేఎస్‌ శ్రీనివాసరాజు
  • ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా – టి.విజయ్‌కుమార్
  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ గా – సిక్తా పట్నాయక్‌
  • గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా – ఇ.శ్రీధర్‌
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోళికేరీకి అదనపు బాధ్యతలు
  • పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + five =