తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 1, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 66,677 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 19,202 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 517, రంగారెడ్డిలో 181, మేడ్చల్ లో 146, వరంగల్ అర్బన్లో 138, నిజామాబాద్ లో 131, సంగారెడ్డిలో 111, కరీంనగర్ లో 93, ఖమ్మంలో 47, నల్గొండలో 46, కామారెడ్డిలో 42, జోగులాంబ గద్వాల్ లో 38, పెద్దపల్లిలో 37, సూర్యాపేటలో 35, మహబూబ్ నగర్ లో 33, భద్రాద్రి కొత్తగూడెంలో 32, మంచిర్యాలలో 28, రాజన్న సిరిసిల్లలో 28, సిద్దిపేటలో 27, మహబూబాబాద్ లో 24, వరంగల్ రూరల్ లో 22, మెదక్ లో 21, ఆదిలాబాద్ లో 19, జనగామలో 15, జగిత్యాలలో 14, వనపర్తిలో 13, యాదాద్రి భువనగిరిలో 12, నారాయణ్ పేట్ లో 11, ములుగు లో 11 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 1, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 4,77,795
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 66,677
- కొత్తగా నమోదైన కేసులు : 1891
- నమోదైన మరణాలు : 10
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 47,590
- కరోనా రికవరీ రేటు: 71.3%
- యాక్టీవ్ కేసులు : 18,547
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 12,001
- మొత్తం మరణాల సంఖ్య : 540
- కరోనా మరణాల రేటు: 0.80%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu