ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 12, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,234 కు చేరుకుంది. సోమవారం 9AM నుంచి మంగళవారం 9AM వరకు 40,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 197 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7133 కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 234 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,75,690 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2411 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ