ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,900 కు చేరుకుంది. గత 24 గంటల్లో 21922 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 64 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏపీలో మూడు జిలాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదవలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 15, కర్నూల్ లో 2, కృష్ణాలో 9, కడపలో 4, గుంటూరులో 7, చిత్తూరులో 4, అనంతపూర్ లో 4, నెల్లూరులో 8, ప్రకాశంలో 0, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 0 కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనా వలన కృష్ణ జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7154 కు పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 99 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,79,504 కు చేరింది. అలాగే ప్రస్తుతం 1242 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 1 నాటికీ ఏపీలో మొత్తం 1,31,59,794 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ