ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత శాస్త్రవేత్తల చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పదకొండు కొత్త రకాలుగా రూపాంతరం చెందిందని వెల్లడైంది. ఒ, ఏ2, ఏ2ఏ, ఏ3, బి, బి1 సహా మొత్తం 11 రకాలుగా కరోనా వైరస్ మారినట్టు కోల్కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనెమోయిక్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులో ఏ2ఏ అనే రకం ప్రమాదకరంగా మారిందని, చాలా త్వరగా మనుషుల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తోందని పేర్కొన్నారు.
ఏ2ఏ రకం వలనే కరోనా వైరస్ అన్ని దేశాలకూ త్వరితగతిన విస్తరించిందని తెలిపారు. ముందుగా 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో కనిపించిన మొట్టమొదటి కరోనా వైరస్ ‘ఒ’ రకమని, అనంతరం ఆ వైరస్ 10 భిన్న రకాలుగా మారి వ్యాప్తి చెందిందని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలను భయానికి గురి చేసిన సార్స్-కోవ్ వైరస్ కంటే ఏ2ఏ కరోనా వైరస్ రకం అత్యంత ప్రమాదకరమని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]