ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం ఆయా అధికారులని వివిధ శాఖలకు బదిలీ చేశారు.
సీఎస్ సమీర్శర్మ ఉత్తర్వులు ప్రకారం బదిలీ అయిన అధికారులు – వారికి కేటాయించిన శాఖలు
- హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్గా ఉన్న చదలవాడ నాగరాణిని సాంకేతిక విద్యా డైరెక్టర్గా బదిలీ చేశారు.
- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్ను హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు.
- పోలా భాస్కర్ను సాంకేతిక విద్యా డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. కొత్తగా ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్గా ఉన్న కాటంనేని భాస్కర్ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్గా బదిలీ చేశారు.
- అయితే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్ మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- బి. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్గా బదిలీ చేశారు. అలాగే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY