కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు సహా ఇతర కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న అర్చకులు, మౌజమ్/ఇమామ్లు, పాస్టర్లను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్చకులు, పాస్టర్లు, మౌజమ్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ రోజు వారి ఖాతాలకు నగదు జమచేయచేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. 33,80 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది మౌజమ్/ఇమామ్లుతో కలిపి మొత్తం 77,290 మందికి రూ.5 వేలు చొప్పున రూ.37,71,00,000 నగదును ప్రభుత్వం ఈ రోజు వారి ఖాతాల్లో జమచేయనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu