ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే ‘నేవీ డే’ వేడుకలకు సీఎం వైఎస్ జగన్ ను అజేంద్ర బహదూర్ ఆహ్వానించారు. అలాగే ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబయిలో నావికాదళ యుద్దనౌక ఐఎన్ఎస్ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎంకు వివరించారు. అనంతరం అజేంద్ర బహదూర్ సింగ్ని సీఎం వైఎస్ జగన్ సన్మానించి, శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో అజేంద్ర బహదూర్ సింగ్ తో పాటుగా పలువురు నేవీ ఉన్నతాధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ