ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ ఈరోజు (గురువారం) పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం విజయవాడ బందర్ రోడ్డులో గల ఏపీపీఎస్సీ కార్యాలయానికి చేరుకున్న గౌతమ్ సవాంగ్.. చైర్మన్ ఛాంబర్లో నూతన ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఛాంబర్లో నిర్వహించిన పూజ అనంతరం గౌతమ్ సవాంగ్ ఆశీర్వాదం తీసుకున్నారు. 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్ ను రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా వారం రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నూతన డీజీపీ గా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ