హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో గురువారం 11వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నేటి నుంచి ఐదు రోజుల పాటుగా ఫిబ్రవరి 28 వరకు ఈ గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. స్టాళ్లలో ఉన్న పలు రకాల మొక్కలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, నర్సరీ మేళా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి వచ్చి 100కు పైగా స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు చేశారని, నగర వాసులకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఇళ్ళల్లో మొక్కలు పెంచడం వల్ల చక్కటి వాతావరణం ఏర్పరుచుకోవచ్చని, అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెప్పారు. ఇక్కడ అరుదైన రకాల మొక్కలు ఉన్నాయని, హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి వేదికని అన్నారు. నగర ప్రజలు గ్రాండ్ నర్సరీ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ