ఆ స్థానం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ..

ganta srinivasarao, tdp, ap politics, ap elections, chandrababu naidu,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, TDP Chief Chandrababu Naidu,andhra pradesh,AP Political updates,vishakapatam,AP,Mango News Telugu,Mango News
ganta srinivasarao, tdp, ap politics, ap elections, chandrababu naidu

ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు గంటా శ్రీనివాసరావు. ఉమ్మడి విశాఖ జిల్లాపై ఆయనకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గంటా గెలుపొందారు. ఈసారి కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం ఈసారి గంటా స్థానాన్ని మార్చాలని అనుకుంటోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు సూచించింది. అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో.. గంటా శ్రీనివాసరావు బహిరంగంగానే పలుమార్లు అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈక్రమంలో ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈక్రమంలో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయింది. గంటా శ్రీనివాసరావును పిలుపించుకొని చర్చలు జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు.. సీటు విషయంలో గంటాకు హామీ ఇచ్చారట. విశాఖ ఉత్తరంతో పాటు భీమిలి లేదాచోడవరంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని గంటా అన్నారట. అయితే భీమిలిని జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బరిలోకి దిగనున్నారు. ఈక్రమంలో చోడవరం టికెట్ ఇచ్చేందుకు పరిశీలిస్తామని.. ఒకవేళ చోడవరం కుదరకపోతే మాడుగుల టికెట్ ఇస్తామని గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారట.

అయితే మాడుగులలో ఇప్పటికే టీడీపీ టికెట్ కోసం గట్టి పోటీ ఉంది. పెద్ద ఎత్తున నేతలు ఆ టికెట్ ఆశిస్తున్నారు. మాడుగుల టీడీపీ ఇంఛార్జ్ పీవీజీ కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రమానాయుడుతో పాటు పైలా ప్రసాద్ అనే ఎన్నారై కూడా ఆ టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఆ ముగ్గురు కూడా టికెట్ కోసం తీవ్రంగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పోటీలో గంటా శ్రీనివాసరావు కూడా చేరారు.

వాస్తవానికి మాడుగుల వైసీపీకి కంచుకోట. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో రెడుసార్లు ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ముత్యాల నాయుడు తహతహలాడుతున్నాడు. అటు వైసీపీ హైకమాండ్ కూడా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ముత్యాల నాయుడును ఢీ కొట్టాలంటే అది గంటాతోనే అవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట. అందుకే టికెట్ ఆశిస్తున్న ఆ ముగ్గురిని సైడ్ చేసి.. గంటాకు మాడుగుల టికెట్ కట్టబెట్టాలని ఆలోచిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 16 =