రేపు భేటీ కానున్న హైపవర్‌ కమిటీ

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Capital Issue, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, GN Rao BCG Reports, GN Rao Committee On AP Capitals, High Power Committee To Meet

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ మరియు బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను చర్చించడానికి జనవరి 7, మంగళవారం నాడు హైపవర్‌ కమిటీ భేటీ కానుంది. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కమిటీ తొలి సమావేశం జరగనుంది. 10మంది మంత్రులుతో సహా సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులుతో మొత్తం 16 మందిని హైపవర్‌ కమిటీ సభ్యులుగా నియమించారు. ముందుగా జనవరి 6, సోమవారం నాడు హైపవర్‌ కమిటీ భేటీ కావాల్సివుండగా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడం వలన మంగళవారానికి వాయిదా వేశారు. అలాగే జనవరి 20వ తేదీలోగా హైపవర్‌ కమిటీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

హైపవర్‌ కమిటీ సభ్యులు:

  • ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
  • హోంమంత్రి మేకతోటి సుచరిత
  • మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
  • ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
  • పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
  • విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌
  • పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని
  • వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
  • రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
  • మార్కెటింగ్‌ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
  • ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం
  • ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
  • సీసీఎల్‌ఏ
  • పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
  • న్యాయ శాఖ కార్యదర్శి

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 5 =