ప్రముఖ సినీ నటి నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చెన్నైలోని మహాబలిపురంలోగల ఓ ప్రముఖ హోటల్ లో కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం నయనతార, విఘ్నేశ్ శివన్ వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన నయనతార, విఘ్నేశ్ శివన్ లకు సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రజనీకాంత్, షారూఖ్ ఖాన్, సూర్య, విజయ్, విక్రమ్ ప్రభు, దర్శకులు మణిరత్నం అట్లీ, పలువురు సినీ నిర్మాతలు, సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులైన నయనతార, విఘ్నేశ్ శివన్ ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకలో నటుడు రజనీకాంత్ విఘ్నేష్ శివన్కు నయనతార మెడలో కట్టడానికి మంగళసూత్రాన్ని అందించినట్లు తెలుస్తుంది. వివాహం అనంతరం విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. అలాగే “ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10…ఆమె నయన్ మరియు నేను ఒకటి. భగవంతుని దయతో, విశ్వం, మా తల్లిదండ్రులు మరియు మంచి స్నేహితులందరి ఆశీర్వాదాలతో ఇప్పుడే నయనతారను పెళ్లి చేసుకున్నాను” అని విఘ్నేశ్ శివన్ పోస్ట్ చేశాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY