ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కోర్టు సెలవుల్లో ఉండనుంది. అయితే అత్యవసర వ్యాజ్యాల విచారణ కొరకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 12, 19, 26వ తేదీల్లో మరియు రెండవ దశ వెకేషన్ కోర్టులు జూన్ 2, 9వ తేదీలలో విచారణ చేపట్టనున్నాయి. మొదటిదశ కోర్టుల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథ రావు, జస్టిస్ తర్లాడ రాజశేఖర రావు, జస్టిస్ చీమలపాటి రవి విచారణ నిర్వహించనుండగా.. రెండవ దశ కోర్టుల్లో జస్టిస్ యు. దుర్గాప్రసాద రావు, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణలు నిర్వహించనున్నారు. కాగా జూన్ 13వ తేదీ నుంచి హైకోర్టు సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ