నెల్లిమర్ల సీటు కోసం తీవ్ర పోటీ

YSRC, TDP, Janasena, AP Elections, nellimarla, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, chandrababu, pawan kalyan, andhra pradesh,Mango News Telugu, Mango News
TDP, Janasena, AP Elections, nellimarla

నెల్లిమర్ల.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం ఆ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఆ నియోజకవర్గం కోసం గట్టి పోటీ నెలకొంది. టికెట్ తమకే ఇవ్వాలంటే.. తమకే కేటాయించాలంటూ ప్రధాన పార్టీల్లో నేతలు పోటీపడుతున్నారు. ఈక్రమంలో నెల్లిమర్ల  సీటు హాట్ హాట్‌గా మారిపోయింది. ప్రస్తుతం భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. 2025 నాటికి ఎయిర్‌పోర్టు మొదటి దశ పనులు పూర్తికానున్నాయి. భోగాపురం నెల్లిమర్ల నియోజకవర్గంలోకే వస్తోంది. ఎయిర్‌పోర్టుతో ఆ నియోజకవర్గ రూపురేఖలన్నీ మారిపోనున్నాయి. అందుకే నేతలంతా అంతలా పోటీపడుతున్నారు.

ఇటు తెలుగుదేశం-జనసేన కూటమిలో కూడా ఆ సీటు కోసం పోటీనెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీలో ఆ సీటు కోసం నేతలు పోటీపడుతున్నారు. గతంలో నెల్లిమర్ల ఇంఛార్జిగా కర్రోతు బంగార్రాజును చంద్రబాబు నాయుడు నియమించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ టికెట్ తనకే ఇవ్వాలని బంగార్రాజు కోరుతున్నారు. అటు మాజీ మంత్రి పతిపాడు నారాయణ స్వామి కూడా ఆ సీటుపైన కన్నేశారు. ఆ టికెట్ ఈసారి తనకే కేటాయించాలని.. కచ్చితంగా గెలిచి తీరుతానని టీడీపీ హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట.

అటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా నెల్లిమర్లపై కన్నేశారట. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని చంద్రబాబును పవన్ కోరుతున్నారట. ఇటీవల భేటీ అయినప్పుడు కూడా నెల్లిమర్ల టికెట్ తమకే ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరారట. ఆ సీటు విషయంలో పవన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదట. ఇప్పటికే జనసేన నెల్లిమర్ల అభ్యర్థిని కూడా ఫైనల్ చేసిందట. లోకం మాధవిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోందట. మాధవి కూడా కచ్చితంగా నెల్లిమర్ల టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారట.

అయితే అటు చంద్రబాబు మాత్రం ఆ టికెట్ జనసేనకు కేటాయించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది. సామాజిక సమీకరణలో భాగంగా ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని బరిలోకి దించితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారట. అటు వైసీపీ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడినే మరోసారి బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో ఆయనపై కచ్చితంగా తమ అభ్యర్థి గెలిచి తీరుతారనే ధీమాతో ఉన్నారట చంద్రబాబు నాయుడు. అందుకే నెల్లిమర్ల విషయంలో చంద్రబాబు కూడా వెనుకడుగు వేయడం లేదట. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుంది? చివరికి ఎవరికి దక్కుతుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =