ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 5వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న, సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జీ-20 సమ్మిట్ పై జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. దేశంలోని అన్ని పార్టీల అధినేతలు కూడా కేంద్రం ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరుకానున్నట్టు తెలుస్తుంది.
కాగా ఇటీవలే ఇండోనేషియాలోని బాలిలో 17వ జీ-20 సమ్మిట్ ముగిసిన అనంతరం జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించింది. 2022, డిసెంబర్ 1 నుండి జీ-20 సమ్మిట్ కు భారతదేశం అధికారికంగా అధ్యక్షత వహించనుంది. భారత్ యొక్క G20 ప్రెసిడెన్సీ/అధ్యక్షత లోగో, థీమ్ మరియు వెబ్సైట్ను కూడా ఇటీవలే ప్రధాని మోదీ ఆవిష్కరించారు. భారత్ తన జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో, భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో 32 విభిన్న రంగాలలో సుమారు 200 సమావేశాలను నిర్వహించనుంది. అలాగే వచ్చే ఏడాది దేశంలో జరగనున్న జీ-20 సమ్మిట్ ను భారత్ నిర్వహించనున్న అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా ఘనంగా నిర్వహించి, విజయవంతం చేసేందుకు కేంద్రం ఏర్పాట్లను ప్రారంభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE