జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 24, సోమవారం నాడు నియమించారు. ఈ కమిటీలు స్థానిక బీజేపీ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ఉభయపార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను జిల్లా స్థాయి నుంచి గ్రామా స్థాయి వరకు అమలయ్యేలా చూడడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా, ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ, గోదావరి సంయుక్త కమిటీ, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ, రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ, రాయలసీమ సంయుక్త కమిటీ వంటి పేర్లతో 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ చొప్పున నియమించారు.
ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ (శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి) :
- కన్వీనర్: సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి)
- జాయింట్ కన్వీనర్: గడసాల అప్పారావు (గాజువాక)
- సభ్యులు:
=> పరుచూరి భాస్కరరావు (అనకాపల్లి)
=> పేడాడ రామ్మోహన్ (ఆమదాలవలస)
=> డాక్టర్ బొడ్డేపల్లి రఘు (విశాఖపట్నం)
గోదావరి సంయుక్త కమిటీ (కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు):
- కన్వీనర్: మేడా గురుదత్ (రాజమహేంద్రవరం)
- జాయింట్ కన్వీనర్: శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం)
- సభ్యులు:
=> వేగుళ్ల లీలాకృష్ణ (మండపేట)
=> బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం)
=> యిర్రంకి సూర్యారావు (భీమవరం)
=> గుణ్ణం నాగబాబు (పాలకొల్లు)
సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ (విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల) :
- కన్వీనర్: కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె., గుంటూరు)
- జాయింట్ కన్వీనర్: సయ్యద్ జిలానీ (నరసరావుపేట)
- సభ్యులు:
=> పోతిన వెంకట మహేష్ (విజయవాడ)
=> అమ్మిశెట్టి వాసు (విజయవాడ)
=> గాదె వెంకటేశ్వర రావు (గుంటూరు)
=> శ్రీమతి పాకనాటి రమాదేవి (గుంటూరు)
రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ (తిరుపతి, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు):
- కన్వీనర్: డా.పసుపులేటి హరిప్రసాద్
- జాయింట్ కన్వీనర్: షేక్ రియాజ్
- సభ్యులు:
=> డా.పొన్ను యుగంధర్ (గంగాధర నెల్లూరు)
=> సయ్యద్ ముకరం చాంద్ (రాజంపేట)
=> యగవింటి (మైఫోర్స్)
=> మహేష్ (మదనపల్లి)
=> మాసి కృష్ణమూర్తి (తిరుపతి)
=> శ్రీమతి ఆరేటి కవిత (చిత్తూరు)
=> గానుగపెంట శ్రీకాంత్ (నెల్లూరు)
రాయలసీమ సంయుక్త కమిటీ (అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప) :
- కన్వీనర్: టి.సి.వరుణ్ (అనంతపురం)
- జాయింట్ కన్వీనర్: సుంకర శ్రీనివాస్ (కడప)
- సభ్యులు:
=> చింతా సురేష్ (కర్నూలు)
=> శ్రీమతి రేఖ గౌడ్ (ఎమ్మిగనూరు)
=> ఆకుల ఉమేష్ (హిందూపురం)
=> మలిశెట్టి వెంకటరమణ (కడప).
[subscribe]