దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 83,167 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.59 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,53,592 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి.
అలాగే కొత్తగా మరో 8 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,29,024 కి పెరిగింది. మరో 1,723 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,06,656 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 17,912 (0.04%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (అక్టోబర్ 30 (8am)–అక్టోబర్ 31 (8am)):
- మహారాష్ట్ర – 286
- కేరళ – 237
- కర్ణాటక – 185
- తమిళనాడు – 158
- తెలంగాణ – 66
- రాజస్థాన్ – 62
- ఢిల్లీ – 53
- గుజరాత్ – 41
- పశ్చిమబెంగాల్ – 36
- ఉత్తర్ ప్రదేశ్ – 34.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE