వలస కూలీల దుర్మరణం బాధాకరం- పవన్ కళ్యాణ్

Aurangabad, Aurangabad Train Accident, Aurangabad Train Accident live maharashtra, Aurangabad Train Accident Updates, Janasena, janasena chief, janasena chief pawan kalyan, Maharashtra train accident, pawan kalyan, Pawan Kalyan Over Aurangabad Train Accident, Train Accident

మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్‌ ప్రాంతంలో మే 8, శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీల దుర్మరణం బాధాకరమని, ఈ ఘటన తీవ్ర దిగ్భాంతికి గురిచేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. “మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర చోటుచేసుకున్న గూడ్స్ ట్రైన్ ప్రమాదంలో 16 మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భాంతికి లోనయ్యాను. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ” పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

“వీరంతా మధ్యప్రదేశ్ నుంచి పొట్టకూటి కోసం మహారాష్ట్రకు వలస వచ్చిన కూలీలు కావడం మరింత బాధాకరం. లాక్ డౌన్ తో ఉపాధి లేక స్వస్థలాలకు కాలినడకన వెళ్తూ పట్టాలపైనే పడుకున్నారని తెలిసింది. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడం కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. వీటికి సంబంధించిన సమన్వయ బాధ్యతలను చేపట్టడంలో, సంబంధిత సమాచారాన్ని కూలీలకు అందించడంలో రాష్ట్రాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ దుర్ఘటన తెలియచేస్తోందని ” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =