ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనా నియమించబడ్డారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముకేశ్ కుమార్ మీనా ప్రస్తుతం రాష్ట్ర వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ సీఈవోగా ఉన్న కె.విజయానంద్ స్థానంలో ముకేశ్ కుమార్ మీనాను నియమిస్తునట్టు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో వెల్లడించింది. అలాగే సీఈవోగా వెంటనే బాధ్యతలు చేపట్టాలని ముకేశ్ కుమార్ మీనాను ఈసీఐ ఆదేశించింది. సీఈవోగా బాధ్యతలు చేపట్టాక ముకేశ్ కుమార్ రాష్ట్రంలో ఇతర ఏ పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతలు కూడా చెప్పకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF