గుంటూరులోని వికాస్ హాస్టల్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
“గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ, ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరం. జనతా వస్త్రాలు, కానుకల కోసం వచ్చిన ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట మూలంగా ఎనిమిది మంది మృతి చెందిన ఘటన మరువక ముందే ఇప్పుడు గుంటూరులో తొక్కిసలాట చోటుచేసుకోవడం ఆందోళనకు లోను చేసింది. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు పోలీసు యంత్రాంగం తగిన భద్రతను ఏర్పాటు చేయాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE