జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అనంతపురం జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర ప్రారంభించారు . ముందుగా కౌలు రైతుల భరోసా యాత్ర కోసం పుట్టపర్తి విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుని సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని రామకృష్ణ భార్య సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
అనంతరం ధర్మవరం, ధర్మవరం రూరల్ లోని గొట్లూరు, అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట, మన్నీల గ్రామాలకు చేరుకొని అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి, లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు టి.సి.వరుణ్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ