జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశరాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాజస్థాన్ లోని ఉదయపూర్ వెళ్లిన ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా కీలక భేటీలు జరుపనున్నట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై జనసేనాని బీజేపీ నేతలకు వివరించనున్నారని సమాచారం. ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణ మరియు పొత్తులపై మరింత స్పష్టత తదితర అంశాలపై కూడా బీజేపీ ముఖ్యులతో కీలక చర్చలు చేయనున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాగా సీఎం జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE