తిరుమల ఆలయ క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి వసంత-సాలకట్ల వసంతోత్సవం వార్షిక ఉత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో నేటి నుండి 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. కాగా ఈ మూడు రోజుల వేడుకలను ప్రతి ఏడాది పవిత్రమైన చైత్ర శుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వసంత మండపం వద్ద ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం జరగనుంది. కాగా ఈ ఉత్సవాల సందర్భంగా ఈ మూడు రోజుల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయగా, ఏప్రిల్ 4న అష్టదళ పాద పద్మారాధన సేవ కూడా రద్దు చేయబడింది.
ఇక ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ఈరోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారిని ఆలయానికి అనుకుని ఉన్న నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి చేరుకున్నారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదన పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. ఈ విశేష పూజలో పాలు, పెరుగు, తేనే, పసుపు, చందనం, కొబ్బరినీళ్లు వంటి వాటితో స్వామివారి మూర్తులకు అభిషేకం చేస్తారు. అలాగే సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE