జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు. ముందుగా విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు ఘనస్వాగతం తెలిపారు. విమానాశ్రయం వద్ద థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు నిర్వహించి జనసేనానికి స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నేతలు, జన సైనికులతో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా నోవాటెల్ కు వెళ్తున్నారు. జనసేన భారీ ర్యాలీ వైజాగ్ ఎయిర్ పోర్ట్, ఎన్ఎడి ఫ్లై ఓవర్, తాటిచెట్ల పాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్ వరకు సాగనుంది.
ఇక ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన నాయకులతో సమావేశమై పార్టీ ప్రణాళికలు, అమలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే అక్టోబర్ 16, ఆదివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల ‘జనవాణి’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల నుంచి సమస్యలపై వచ్చే అర్జీలను పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించి, సమస్యల గురించి తెలుసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
అదేవిధంగా అక్టోబర్ 17, సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం బీచ్ రోడ్డులోని వై.ఎం.సీ.ఏ హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశమై పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారు. ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నేత నాగబాబు, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY