ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జనసేన తరఫున, జనసైనికుల తరపున, రాష్ట్ర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియచేస్తూ స్వాగతం పలుకుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. మనందరి గుండెల్లో స్ఫూర్తిని నింపే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడం ఆనందదాయకమని పవన్ కళ్యాణ్ చెప్పారు.
“ప్రత్యేకంగా భీమవరంలో పోటీ చేసిన నాకు ఈ వేడుక ప్రత్యేకం. ఈ కార్యక్రమానికి నాకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. సోమవారం జరగబోయే కార్యక్రమంలో జనసేన ప్రాతినిధ్యం వహించాలని పార్టీ నాయకులకు సూచించాను. ఈ విగ్రహావిష్కరణతో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక మహా యోధుడయిన అల్లూరి సీతారామరాజు తాలూకు గొప్పతనం ప్రపంచం యావత్తు తెలుస్తుంది. ఆ విధంగా మనందరం ఎంతో అదృష్టవంతులం. ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీకి మరోమారు తెలుగు ప్రజల తరఫున, ఆంధ్రా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY