ఆగస్టు 21న తిరుపతిలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan will held Janavani Program on August 21st at Tirupati, Pawan Kalyan will held Janavani Program on August 21st at Tirupati, Janavani Program on August 21st at Tirupati, Tirupati Janavani Program on August 21st, Janavani Program, Tirupati Janavani Program, Janasena Chief Pawan Kalyan, Janasena President Pawan Kalyan, Pawan Kalyan, Tirupati Janavani Program News, Tirupati Janavani Program Latest News And Updates, Tirupati Janavani Program Live Updates, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 21, ఆదివారం నాడు తిరుపతిలో “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనవాణి కార్యక్రమం ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జరగనుంది. ముందుగా చెప్పినట్లు రాయలసీమ ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 21వ తేదీ, ఆదివారం తిరుపతిలోని జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం మొదలుకానుంది. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రజలు తమ సమస్యలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావచ్చు” అని తెలిపారు.

“ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వయంగా పవన్ కళ్యాణ్ స్వీకరించి, సమస్యలను తెలుసుకుంటారు. ఇప్పటికే జనవాణి కార్యక్రమం విజయవాడలో రెండు విడతలు పూర్తి చేసుకోగా, భీమవరంలోనూ కార్యక్రమం ఇటీవల పూర్తయింది. నాలుగో విడత కార్యక్రమంగా తిరుపతిలో జనవాణి జరగనుంది. మూడు విడతల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, ఆయా శాఖల వారీగా పరిష్కరించేందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేకంగా లేఖలు రాశారు” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 4 =