జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (మే 20, శుక్రవారం) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్, కోదాడల్లో పర్యటనకు ఏర్పాట్లు మొదలయ్యాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారని, అలాగే రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందచేస్తారని తెలిపారు.
మే 20వ తేదీ ఉదయం 10 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి, మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్తారని, అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. ఆ తరవాత కోదాడ చేరుకొని, అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ప్రారంభించిందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF