ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26, గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. మే నెలలో ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ కూడా రాష్ట్రానికి వస్తుండటంతో బీజేపీ నాయకుల్లో కొత్త జోష్ నెలకుంది.
హైదరాబాద్ లోప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కసరత్తు ప్రారంభించి, ప్రధాని పర్యటన సందర్భంగా పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇతర నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ నగరంలో భారీగా కటౌట్స్, బ్యానర్లు ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధాని మోదీ చివరిగా గత ఫిబ్రవరిలో హైద్రాబాద్ లో పర్యటించారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో జరిగిన శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF