రామతీర్థ పోరాట కమిటీని నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Jana Sena sets up Ramateertha Porata Committee in AP, Janasena, Janasena Party Sets up Ramateertha Porata, Janasena Party Sets up Ramateertha Porata Committee, Mango News Telugu, pawan kalyan, Pawan Kalyan Latest News, Pawan Kalyan led Janasena, Ramateertha Porata Committee

రామతీర్థ పోరాట కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్ధంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం మూలవిరాట్ విధ్వంసంపై దోషులను నిర్ధారించి దండించే వరకు బీజేపీతో కలసి పోరాటం చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పవన్ కళ్యాణ్ నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ నేతృత్వం వహిస్తారని, సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డేపల్లి రఘు నియమించినట్టు తెలిపారు. ఈ కేసులో సత్వర న్యాయం జరపడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలసి ఈ కమిటీ పని చేస్తుందని చెప్పారు. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని జనసేన పార్టీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 1 =