జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనవరి 9, ఆదివారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశం నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలను చర్చించనున్నట్టు తెలిపారు. అయితే ఆదివారం ఉదయం జరగాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్టు శనివారం నాడు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ముందు జాగ్రత్తగా పార్టీ సమావేశాన్ని వాయిదా వేశారని, సంక్రాంతి సంబరాలు మొదలయ్యే సమయంలో కరోనా వ్యాప్తి ఉండటం బాధాకరమని చెబుతూ, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ