జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి కడప జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టారు. ముందుగా కౌలు రైతుల భరోసా యాత్ర కోసం కడప విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి బైపాస్ మీదుగా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ సభా వేదిక వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పలువురు కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి, ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారికీ భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు. అనంతరం రచ్చబండ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY