రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Capital Amaravati, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, Janasena Pawan Kalyan Latest News, Janasena President Pawan Kalyan, Mango News Telugu, Pawan Kalyan To Visit Capital Amaravati

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజధానితో సహా ఇతర అంశాలపై ఈ రోజు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతిపై రూపొందించిన ఓ నివేదికను జనసేన పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకుడు నాగబాబు పవన్ కల్యాణ్ కు అందించారు. నివేదికను పరిశీలించిన అనంతరం రాజధానిప్రాంత రైతులతో స్వయంగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచే పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో రాజధాని అంశంపై ఆయన మాట్లాడనున్నారు. 13 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు ఈ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాగా, మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అమరావతి గ్రామాల రైతుల చేస్తున్న ఆందోళనపై కీలకంగా చర్చించారు. అలాగే రాజధాని వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా విడుదల చేశారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 5 =