ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిసాన్ రైలు మంజూరైంది. అనంతపురం-ఢిల్లీ మధ్య ఉద్యాన ఉత్పత్తుల రవాణా కోసం ఈ కిసాన్ రైలు రాకపోకలు సాగించనుంది. అనంతపురం ప్రాంతంలో రైతులకు ఏంతో లబ్ధి చేకూర్చే ఈ కిసాన్ రైలును సెప్టెంబర్ 9 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే తొలి కిసాన్రైలులో 500 టన్నుల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, వ్యాపారులు, అధికారులు కూడా వెళ్లేందుకు ఒక స్లీపర్ కోచ్ కూడా ఏర్పాటు చేశారు.
దేశంలో రైతులు పండించే పళ్ళు, కూరగాయల, ఇతర ఉత్పతుల రవాణాకు రోడ్డుమార్గంతో పోల్చుకుంటే సమయం, ఖర్చు ఆదా అయ్యేలా రైల్వే శాఖ వినూత్నంగా కిసాన్ రైల్ సేవలను ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర నుంచి బీహార్ కు దేశంలోనే తొలి కిసాన్ రైలును ఆగస్టు లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu