ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా తొమ్మిదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10776 పాజిటివ్ కేసులు, 76 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,76,506 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 4276 కి పెరిగింది. మరో 12334 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 59,919 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4276 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 4, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 39,65,694
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 4,76,506
- కొత్తగా నమోదైనా కేసులు : 10776
- నమోదైన మరణాలు : 76
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 3,70,163
- యాక్టీవ్ కేసులు : 102067
- మొత్తం మరణాల సంఖ్య : 4276
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu